SDPT: నంగునూరు(మం) రాంపూర్ వద్ద సిద్దిపేట-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి వరంగల్ వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. జనరేటర్ లోడుతో ఉన్న ఈ వాహన బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.