KMR: నాగిరెడ్డిపేట మండలం బొల్లారం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ నాయకులు పేరుపల్లి సాయిబాబా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహా నేతల ఆదర్శాలను పాటించాలన్నారు. విజ్ఞానంతోనే సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. చదువులు అలవర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.