SRCL: బోయిన్ పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కావ్య (7)కు చేయి విరగగా, అపర్ణిక (6), తీర్థాల కనకయ్య (55) గాయపడ్డారు. మూడు కుక్కలకు రేబిస్ సోకినట్లు సమాచారం. గ్రామస్తులు చర్యలు తీసుకున్నప్పటికీ, మరో రేబిస్ కుక్క ఇంకా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.