ADB: బేలా మండలంలోని గూడా గ్రామంలో NCFE ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. డిజిటల్ లావాదేవీలు, ఆధార్ OTP గోప్యత, సైబర్ క్రైమ్స్, డిజిటల్ ఆరెస్ట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని CFL సిబ్బంది అనికేత్, వినోద్, అజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అవినాష్, ఉప సర్పంచ్ నిఖిల్, గ్రామ వృద్ధులు పాల్గొన్నారు.