కొంకుదురు బుడతలు మామిడి గ్రామంలో ఉగాది సందర్భంగా ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిశాయి. అర్చకులు బ్రహ్మశ్రీ రమణ శర్మ, శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేయగా, మల్లిడి కోదండం బ్రదర్స్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి.