నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరులో ఆయిల్, గ్యాస్ సర్వే కార్యకలాపాలు రైతుల మధ్య కలకలం రేపుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ పొలాల్లో అధికారులు రంధ్రాలు వేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.