SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నెల స్వరూపతో పాటు ఆదర్శ యూత్ సభ్యులు ఉన్నారు.