SRD: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి కార్యక్రమం నేడు అసెంబ్లీ ఆవరణలో జరిగింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సికిందర్తో కలిసి, మాజీ స్పీకర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.