JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అనుబంధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోదావరి నదిలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్నారు. భక్తులు తల పై కొబ్బరి, బెల్లాలు పెట్టుకుని వచ్చి స్వామి వారికి సమర్పించారు. భక్తులు శ్రద్దలతో పూజలు జరిపి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.