KMM: ఖమ్మం నగరంలోని శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షల సంసిద్ధత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.