నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ముధోల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6న శంకుస్థాపన చేస్తారని MLA రామారావు పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందనుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. శంకుస్థాపనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.