JN: నల్గొండలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర-శిక్షణ మహా అభియాన్ వక్తల కార్యశాలకు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ… బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.