ADB: సీఎంఆర్ఎఫ్ తోనే పేద ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బోథ్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన లాలిబాయికి మంజూరైన రూ.13,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం అందజేశారు. వైద్య ఖర్చులు వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని సూచించారు.