BDK: చర్ల మండలం గుంపెనగూడెంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. చర్ల నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ ఢీకొనడంతో చిట్టిబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిత్యం ఇసుక లారీల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.