MDK: టేక్మాల్లోని రైతు వేదిక వద్ద ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్లను పంపిణీ చేశారు. పేట డివిజన్ పరిధిలోని టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన రైతులు ఈ సదుపాయాన్ని పొందారు. అధికారులు మాట్లాడుతూ.. ఆధునిక సాగుకు యంత్రాలు ఎంతో అవసరమని, ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.