SRD: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ శక్తి’ పథకం మహిళా సాధికారతకు ఎంతో దోహదపడుతుందని సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించిన సర్పంచుల శిక్షణా శిబిరంలో ఆమె మాట్లాడారు. ‘బేఠీ బచావో-బేఠీ పడావో’ ద్వారా బాలికల విద్య, రక్షణ, లింగ నిర్ధారణ పరీక్షల నివారణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.