భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతపై ఆరా తీశారు.