వరంగల్: వర్ధన్నపేట మండలంలో నూతన సంవత్సరం వేడుకలకు డిజేలు పెట్టవద్దని, డీజేలు పెట్టి వేడుకలు చేస్తే కేసులు తప్పవని ఎస్సై చందర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం వేడుకల పేరుతో ఏలాంటి డీజేలు పెట్టినా.. మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.