NLG: నేటి నుంచి జరిగే గ్రామసభలను విజయవంతం చేయాలని నాంపల్లి ఎంపీడీవో రామకృష్ణ శర్మ కోరారు. మండలంలోని 32 పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి సభలో కనీసం 200 మంది పాల్గొనేలా చూడాలన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.