NLG: వలిగొండ మండలం రెడ్లరేపాకలో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదో తరగతి పరీక్షకు వెళ్తున్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పహిల్వాన్పురానికి చెందిన స్టూడెంట్ (16) తన స్కూటీపై వలిగొండలోని పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.