VKB: ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు వికారాబాద్ బస్ డిపో మేనేజర్ నమ్రత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి.