KMR: బీర్కూర్ పోలీస్ స్టేషన్ను బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య ఆదివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల నిర్వహణ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఎస్సై మహేందర్కు పలు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణ పనితీరుపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.