BDK: మణుగూరు పగిడేరు గ్రామంలో వేల్పుల శ్రీరాములు సుమలత దంపతుల కుమార్తె ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించి, ఆమె భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది.