SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ జాతర మహోత్సవ పోస్టర్ను మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామి కృపతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.