NGKL: కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు కలెక్టర్ సంతోష్కు వినతిపత్రం ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.