WGL: నగరంలోని గిర్మాజీపేటలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా “న్యూలెమన్ సోడా” తయారు చేస్తున్న సమాచారం మేరకు నేడు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వ్యాపారి వెంకటేశ్వర్లు ఇంట్లో రూ. 24 వేల విలువైన సోడా సీసాలు, సామగ్రిని స్వాధీనంచేసుకున్నారు. వాటిని ఆహార భద్రత అధికారులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.