NRPT: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇవాళ బీజేపీ చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ని జయప్రదం చేయాలని బీజేవైఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి బద్రి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.