NLG: జిల్లాలో రబీలో వరి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో రైతులు వరిపంటవైపు అధికంగా మొగ్గుచూపారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఇప్పటికే రైతులు సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఈ సీజన్లో నెలాఖరు వరకు మరో రూ. 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.