BDK: గ్రామ స్థాయిలో చేపట్టవలసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ఎంపీడీవో శ్రీనివాసరావు చర్చించారు. అశ్వాపురం మండల రైతు వేదికలో గురువారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణపై ఎంపీడీవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు పలు సూచనలు చేశారు.