WGL: ఏటూరునాగారం ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి(ఏపీవో జనరల్) కనక బీంరావు కన్నుమూశారు. ఐటీడీఏ కార్యాలయంలో ఏపీవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన భీంరావ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తోటి ఉద్యోగులు తెలిపారు. గతరాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఏపీవో బాంబర మండలం వాంకిడీలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.