భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం సమీపంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు ఇప్పటికే లభ్యం కాగా, తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఘటనపై మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.