NLG: చిట్యాల మండలంలోని గ్రామ పంచాయతీలకు మంజూరైన చెత్త సేకరణ రిక్షాలు అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడ్డాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద వీటిని కేటాయించగా, నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల ఇవి మాయమవగా, మరికొన్ని చోట్ల ట్రాక్టర్ల రాకతో వీటిని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రజాధనం వృథా అవుతున్న తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.