MNCL: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ పార్దివదేహానికి లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలకు చెందిన నాయకులు, ప్రజలు నివాళి అర్పిస్తున్నారు. మంగళవారం దండేపల్లి మండలంలోని లింగాపూర్లో మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఉంచిన పార్థివ దేహాన్ని వారు సందర్శించారు. జన్నారం మండల మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్తో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.