MNCL: జన్నారం మండలానికి నూతన ఎస్సైని నియమించాలని ప్రజలు కోరారు. ఎస్సైగా పనిచేసిన గొల్లపల్లి అనూషను రామగుండం కమిషనరేట్ వీఆర్కు బదిలీ చేశారు. ఆయన లక్షేట్టిపేట సీఐ జన్నారం పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. మండలంలో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.