MHBD: కురవి మండలకేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర (శివాలయం) స్వామి ఆలయం వద్ద దోపోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.