JGL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ప్రత్యేక వేదికపై ఆలయ ప్రధాన అర్చకులు జితేందర్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పరాభవ నామ సంవత్సరంలో దేశ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా వుంటారని ఆశీర్వచనం అందించారు.