BHPL: టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బిక్కినేని సంపత్ రావు తండ్రి బిక్కినేని మేటల్ రావు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి నిన్న రాత్రి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.