NRPT: మక్తల్ మున్సిపాలిటీ 7వ వార్డులో లబ్ధిదారురాలు తోకలి మల్లమ్మ నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత శనివారం ప్రారంభించారు. గృహప్రవేశం చేసిన దంపతులకు ఆమె సారె పెట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.