NGKL: కల్వకుర్తి పట్టణంలో శంభాజీ యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ 337వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. శంభాజీ చిత్రపటానికి యువసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1689లో తీవ్రమైన మొఘల్ హింసను ధిక్కరించి ధర్మం, స్వరాజ్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశాడని వారు గుర్తు చేశారు.