SRD: జిన్నారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 147 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.