కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొన్నారు. వారితో కలిసి ఆయన ఉపవాస దీక్ష విరమించారు. రంజాన్ క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, అందరూ శాంతియుతంగా మెలగాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు యాదగిరిస్వామి, విజయకుమార్, తదితరులు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.