NRPT: నర్వ మండల కేంద్రంలోని ఓ స్కూల్ విద్యార్థులు “Save Nature, Secure Future” నినాదంతో భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. ప్రకృతిని కాపాడుకోవడమే మానవజాతి మనుగడకు మూలమని చాటిచెబుతూ.. యాత్ర పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సాగింది. నర్వ నుంచి యాంకీ, పెద్దకడుముర్, గట్టు మీదుగా చంద్రగట్టు వరకు 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు.