ASF: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరారు.