NRPT: యేసు ప్రభువు చూపించిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని అన్నారు. క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.