NZB: మోపాల్ మండలం కంజర తెలంగాణ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను పీఎంశ్రీ సభ్యుడు ఐడీఏఎస్ జాయింట్ సెక్రటరీ దేవేందర్ కుమార్ రాయ్ ఇవాళ సందర్శించారు. విద్యార్థినులతో సంభాషించి పాఠశాలలో అమలవుతున్న పీఎంశ్రీ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ విజయ లలితను అభినందించారు.