MBNR : పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో టీబీ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీబీ జిల్లా ఆఫీసర్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో పీయూ, ఎన్ఎస్ఎస్ అధికారులు ప్రవీణ, అర్జున్, రవికాంత్, ఈశ్వర్, గాలన్న చిన్నదేవి పాల్గొన్నారు.