VKB: కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 11, 1 వార్డుల్లోని బస్తీ దవాఖానాలను మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్, కమిషనర్ బలరామ్ నాయక్ తనిఖీ చేశారు. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలుగా హాజరు రిజిస్టర్ లేకుండా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా డీఎంహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేశారు.