NLG: రంజాన్ సందర్భంగా సాగర్ నియోజకవర్గంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. హాలియా లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమం జరిగింది. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మతసామరస్యానికి రంజాన్ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చందర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.