NZB: ధర్పల్లికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు జి.కిషోర్ రెడ్డి (42) గురువారం కన్నుమూశారు. ఉదయం పొలం వద్ద వాకింగ్ ముగించుకుని వచ్చి నిద్రపోయిన ఆయన, ఎంతకీ లేవకపోవడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.