KNR: తిమ్మాపూర్ ఆదర్శ పాఠశాలలో 9-12 తరగతులకు గణిత అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు ఎంఎస్సీ, బీఈడీ అర్హతతో పాటు బోధన అనుభవం కలిగి ఉండాలనీ ప్రిన్సిపల్ వనజ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పారదర్శకంగా డెమో ద్వారా జరుగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 12వ తేదీ లోపు సమర్పించాలని, డెమో 13వ తేదీన జరుగుతుందని వివరించారు.